30 రోజుల ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలి
నవతెలంగాణ-సిరిసిల్ల
ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, జేసీ, పంచాయతీ రాజ్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక అమలు తీరు గుర్తించిన పనులు, పూర్తి చేసిన పనులను కలెక్టర్ కృష్ణభాస్కర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రత్యేక ప్రణాళిక నిరంతరం కొనసాగేలా ప్రజలలో వినూత్న మార్గాల ద్వారా చైతన్యం చేసి గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా చూడాలన్నారు.
ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, జేసీ, పంచాయతీ రాజ్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక అమలు తీరు గుర్తించిన పనులు, పూర్తి చేసిన పనులను కలెక్టర్ కృష్ణభాస్కర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రత్యేక ప్రణాళిక నిరంతరం కొనసాగేలా ప్రజలలో వినూత్న మార్గాల ద్వారా చైతన్యం చేసి గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా చూడాలన్నారు.
జిల్లాలో ప్రణాళిక వియవంతంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన జిల్లా యంత్రాంగం, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పంచాయతీకార్మికులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 1200 మంది క్షేత్ర పంచాయతీ కార్మికులు, సిబ్బందికి సంవత్సరం బీమా ప్రీమియం రూ.4 లక్షలను తన డబ్బులతో మంత్రి చెల్లించారు. సంబంధిత బీమా బాండ్లను కార్మికులకు అందించాలని కలెక్టర్కు సూచించారు. ఇంకుడు గుంతలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. మానేరు నదీ తీరం ఎగువ మానేరు నుండి మధ్య మానేరు వరకు నదికి ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మిషన్ భగీరథ పనులు 99శాతం పూర్తయినందున శుద్ధమైన భగీరథ తాగునీరు తాగేలా ప్రజలకు చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్బాషా, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రవీందర్, డీటీవో కొండల్రావు, డీఆర్డీవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment