4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.15 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను క్లస్టర్లుగా విభజించి నియమించామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నామని తెలిపారు.
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.15 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను క్లస్టర్లుగా విభజించి నియమించామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నామని తెలిపారు.
Comments
Post a Comment