'భగీరథ' యత్నం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రతినిధి
'వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీరు ఇస్తాం. లేని పక్షంలో ఓట్లు అడగబోం. అంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన కేసీఆర్ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఎప్పటికీ నల్లా నీరు అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇంటింటికీ నల్లా ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తునే ఉన్నారు. పలుమార్లు డెడ్లైన్లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరెంత సమయం తీసుకుంటుందో ప్రభుత్వాధినేతలే సెలవివ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అందులో మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.
'వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీరు ఇస్తాం. లేని పక్షంలో ఓట్లు అడగబోం. అంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన కేసీఆర్ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఎప్పటికీ నల్లా నీరు అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇంటింటికీ నల్లా ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తునే ఉన్నారు. పలుమార్లు డెడ్లైన్లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరెంత సమయం తీసుకుంటుందో ప్రభుత్వాధినేతలే సెలవివ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అందులో మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.
అదే రీతిలో 374 ట్యాంకులు నిర్మించాల్సి ఉం డగా ఇంత వరకు 371 పూర్తయ్యియి. పైప్లైన్లు 1750 కిలో మీటర్లకు గాను 1747 కిలోమిటర్లు పూర్తి చేశారు. ఇక ఇంటింటికి నల్లా విషయానికి వస్తే లక్షా 74 వేలా 657 నల్లాలు ఇచ్చారు. 20 15లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇంకా నత్తనడకనా సాగుతునే ఉంది. పెద్దపల్లి జిల్లాలో 440 నివాస ప్రాంతాలకు గాను 419 ప్రాంతాలకు బల్క్ సరఫరా జరుగుతోంది. 294 ట్యాంకులకు గాను 293 నిర్మించారు. పైప్లైన్ నిర్మాణం 1879 కిలోమీటర్లకు గాను 1860 కిలోమీటర్లు పూర్తియ్యా యి. లక్షా 47వేలా 973 ఇండ్లకు నల్లాలు బిగించా రు. ఇంతవరకు లెక్కలు సక్రమంగా ఉన్నప్పటికి నీరందించే పనిమాత్రం ప్రారంభించలేదు. పలుచోట్ల ఈ వెలితి వెక్కిరిస్తూనే ఉంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేంశించుకున్నారు. అయినప్పటికీ అంతలోగా పూర్తయ్యే వాతావారణం కనిపించడంలేదు. ఈ ఏడాది ఆఖరు నాటికైనా పూర్తవుతుందోలేదో వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment